రాష్ట్రంలోని అన్ని లిఫ్ట్ల బాధ్యత ఇకనుంచి ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) ఆధ్వర్యంలో అదేవిధంగా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లిఫ్ట్ల బాధ్యతలు ఇకపై ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుతం పలు ఎన్జీవోలు, కొన్ని సంఘాలు, పలు సొసైటీలు వీటి నిర్వహణ బాధ్యతను చూస్తున్నవి. ఇకపై ఈ లిఫ్ట్లన్నింటిని కింద రైతుల మీద ఏటువంటి పైసా భారం లేకుండా అన్నింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇందులో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. వాళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందని వెల్లడించారు. దీని వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఐదారువందల లిఫ్ట్లకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. రైతాంగం అంతా సంతోష పడుతరన్నారు. హుజూర్నగర్ కృతజ్ఞత సభ ద్వారా తెలంగాణ ఐడీసీ రైతాంగానికి అంతటికి కూడా ఈ శుభవార్త తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు.